11.22.07

నేహ – నగర విహారం

వర్గాలు దృశ్యమాలికలు వద్ద 5:52 అపరాహ్నం ద్వారా poolavaana

అది హైదరాబాద్ సంస్థానాన్ని నేహ యువరాణి పరిపాలిస్తున్న రోజులు. తన రాజ్యంలో ప్రజలంతా అల్లరి చేస్తూ, ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకున్నారు యువరాణి. ఆ సంవత్సరం బడికి వేసం కాలం సెలవలు ఇవ్వడంతో, యువరాణీ వారు తమ తాతగారైన రామోహన్రావు గారి ఆహ్వానం మేరకు, వారి గృహాన్ని పావనం చేశారు. అదే సమయంలో జాగ్రలమూడి, నారాకోడూరు, అంగలకుదురు కొల్లూరు తదితర గ్రామాలను సందర్శించారు. సెలవలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో, రామ్మోహన్రావు, శోభ దంపతులు రాణివారికి మధు పర్కాలు అందించారు. హై.బ్యాడ్ కి తిరిగి వచ్చాక ఒక నాడు రాణీ వారు, ఆ నూతన వస్త్రాలు ధరించి నగర విహారానికి బయల్దేరారు. అదిగో.. ఆ సందర్భంలోనివి ఈ చిత్రాలు.

తర్వాతి పేజీ